భారత్ లో కరోనా టీకాలకు డీసీజీఐ అనుమతి
ఢిల్లీ : కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న భారతావనికి డీసీజీఐ ఊరట కల్పించింది. ఈ మేరకు ఆదివారం కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపి శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి.కరోనా వ్యక్సి న్ పై పలు పరిశోధనలు అనంతరం ఈ మేరకు నిరయం ప్రకటించింది.
ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్ మూడో
దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్
ఎఫెక్ట్స్ ఉండవు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా
ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు
వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. . డిసీజీఐ అనుమతితో మరో
వారం రోజుల్లోనే భారత్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా
వ్యాక్సిన్ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు
తెలిపారు.
Comments
Post a Comment