ఏపీలో మూడు రాజధానులు పై సీఎం మరోసారి ...
ఏలూరు: అన్ని ప్రాంతాలవారికి అభివృద్ధి ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ ద్యేయమని రాజధాని విభజనపై సీఎం జగన్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్ములాతో ముందుకెళ్తామన్న సంకేతాలిచ్చారు. శుక్రవారం ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వ నిర్ణయాలతో కొందరికే న్యాయం జరిగిందంటూ సీఎం రాజకీయ విమర్శలు చేశారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని నాటి నిర్ణయాలను సరిదిద్ధి అన్ని ప్రాంతాలవారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. తమ దృష్టిలో మూడు ప్రాంతాలూ సమానమేనంటూ రాజధానిపై పరోక్షంగా జగన్ పేర్కొన్నారు.
Comments
Post a Comment